కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

byసూర్య | Sun, Apr 28, 2024, 07:25 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రచార పర్వం జోరందుకోవటంతో.. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలు కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కేటీఆర్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు.. భువనగిరి సెగ్మెంట్ పరిధిలో రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.


ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్‌లో జరిగిన అవినీతిలో భాగంగా.. కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.


పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని.. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుందంటూ రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన దోమకొండ మాజీ ఎంపీపీ Sun, May 12, 2024, 10:11 PM
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ Sun, May 12, 2024, 10:09 PM
జాతీయ స్థాయి పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు Sun, May 12, 2024, 10:08 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Sun, May 12, 2024, 10:06 PM
కామారెడ్డిలో పోలింగుకు సర్వం సిద్ధం: జిల్లా ఎన్నికల అధికారి Sun, May 12, 2024, 10:05 PM