byసూర్య | Sun, Apr 28, 2024, 10:17 AM
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం టూ టౌన్ సిఐ బాలకృష్ణ తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవతి సెంటర్ నుండి జెండాల సెంటర్ వరకు సెంట్రల్ పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీసు సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.