చదువుపై మక్కువ.. వద్దంటే పెళ్లి చేసిన పేరెంట్స్, పాపం నవ వధువు

byసూర్య | Tue, Apr 23, 2024, 07:48 PM

ఉన్నత చదువులు చదవాలనేది ఆ యువతి కోరిక. గొప్పగా చదివి తనకంటూ సమాజంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే ఆరాటం. కానీ.. కుటుంబ పరిస్థితులు మాత్రం వేరు. పై చదువులు చదివించే స్థోమత లేదు. పైగా తల్లికి అనారోగ్యం. దీంతో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఓ అబ్బాయిని చూసి ఘనంగా పెళ్లి చేశారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేయంటంతో నెల రోజులు గడవక ముందే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి (23) ఇటీవల బీఎస్సీ పూర్తిచేసింది. అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. అయితే తల్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. అదే మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిపించారు.


పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఖమ్మం తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


Latest News
 

నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. ఈ జిల్లాల్లో మాడుపగిలే ఎండలు, రెడ్ అలర్ట్ జారీ Fri, May 03, 2024, 10:36 PM
అమిత్ షాపై కేసు నమోదు.. ఆ నలుగురిపై కూడా Fri, May 03, 2024, 10:31 PM