byసూర్య | Tue, Apr 23, 2024, 07:31 PM
స్మితా సబర్వాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లెవరూ ఉండరు. కేసీఆర్ సర్కారు హయాంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇక.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ట్రెండింగ్ టాపిక్లపై స్పందిస్తూ తన అభిప్రాయాలను, తన పర్సనల్ జీవితంలోని విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. నెటిజన్లతో నిత్యం టచ్లో ఉంటారు. ఫొటోలు, వీడియోలే కాదు.. కొన్ని సార్లు ఇంట్రస్టింగ్ ట్వీట్లు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించటమే కాకుండా.. ఆలోచింపజేస్తుంటారు.
తాజాగా.. మంగళవారం రోజున ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్.. "కల్పన అనేది అబద్ధం లోపల దాగున్న నిజం.." అంటూ అసక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలను బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోండి. మీ మెదడు యొక్క ఆలోచనలను విస్తరించేందుకు.. కొన్ని ఆలోచనల నుంచి తప్పించుకునేందుకు శిక్షణ ఇచ్చే ఏకైక ట్రైనర్ పుస్తకమే..." అంటూ అందరినీ ఆలోచింపజేసే ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ఈ ట్వీట్తో పాటు తాను పుస్తకం చదువుతున్న ఫొటోను పంచుకున్నారు.
దీంతో పాటు.. స్మితా సబర్వాల్ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఆమె ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. ఓ సెలెబ్రిటీకి వచ్చినంతగా రెస్పాన్స్ రావటం విశేషం. చాలా రోజుల తర్వాత.. ఈ మధ్య స్మితా సబర్వాల్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. చాలా విషయాలు పంచుకున్నారు. తాన బాల్యం నుంచి మొదలు.. ఐఏఎస్ క్లియర్ చేయటం, ట్రైనింగ్, కలెక్టర్గా కరీంనగర్, మెదక్ జిల్లాలతో ఉన్న ప్రత్యేక బంధం, తన పర్సనల్ జీవితంలోని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను స్మితా సబర్వాల్ పంచుకున్నారు.