byసూర్య | Tue, Apr 23, 2024, 12:31 PM
ఉపాధి హామీ పథకంలో భాగంగా మందమర్రి మండలంలోని శంకర్ పల్లి, చిర్రకుంట, పొన్నారం, మామిడి గట్టు గ్రామ పంచాయతీలకు క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వై. రాయమల్లును సస్పెండ్ చేస్తూ డీఆర్డీవో కిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి కారణం లేకుండా నెలరోజులుగా విధులకు గైర్హాజరు కావడం వల్లే సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.