మైగ్రేన్‌‌ బాధితులకు శుభవార్త.. ఏఐజీ డాక్టర్ల అరుదైన ట్రీట్మెంట్ సక్సెస్.. ఆసియాలోనే తొలిసారిగా

byసూర్య | Sun, Apr 21, 2024, 07:32 PM

దీర్ఘకాలిక తలనొప్పి తో బాధపడుతున్న బాధితులకు ఉపశమనం కలిగించే వార్త వినిపించారు ఏఐజీ వైద్యులు. ప్రస్తుత కాలంలో.. జీవన విధానాల వల్లో, పని ఒత్తిడితోనో, సరిపడా విశ్రాంతి లేకపోవటం వల్లో, మానసిక ఇబ్బందులతోనే.. చాలా మంది మైగ్రేన్‌ సమస్యతో నరకం చూస్తున్నారు. ఎంత మంది డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నా.. ఎన్ని మందులు వాడినా.. మైగ్రేన్ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప.. శాశ్వత ఉపశమనం మాత్రం దొరకట్లేదు. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ వైద్యులు చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ కావటంతో మైగ్రేన్ బాధితులకు ఉపశమనం దొరికినట్టయింది.


మైగ్రేన్‌‌తో బాధపడుతున్న మారిషస్‌కు చెందిన 24 ఏళ్ల మహిళకు అరుదైన చికిత్సతో ఏఐజీ డాక్టర్లు ఉపశమనం కల్పించారు. పేస్‌మేకర్‌ మాదిరిగా.. న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌ ద్వారా మైగ్రేన్‌కు సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే.. బాధితురరాలు ఇప్పటికే పలు దేశాల్లో తన సమస్యకు చికిత్స తీసుకున్నా.. పూర్తిస్థాయిలో నయం కాలేదు. దీంతో.. ఆమె హైదరాబాద్‌కు వచ్చి ఏఐజీ వైద్యులను సంప్రదించారు.


ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ క్రానిక్‌ పెయిన్‌, న్యూరోమాడ్యులేషన్‌ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ చావలి, న్యూరో సర్జరీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సుబోధ్‌ కలిసి బాధితురాలిని పరిశీలించారు. హై సర్వైకల్‌ స్పైనల్‌ కార్డ్‌ స్టిమ్యులేటర్‌ ఇంప్లాంటేషన్‌ (Neuro Stimulator) ప్రక్రియతో చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. శరీరంలో ఎక్కడ నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకు అందుతాయి. ఈ క్రమంలోనే.. న్యూరో స్టిమ్యూలేటర్ ద్వారా నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు చేరుకోక ముందే అడ్డుకుని.. ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ చికిత్సా పద్ధతినే మారిషస్ మహిళకు చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే.. న్యూరో స్టిమ్యులేటర్‌ పరికరాన్ని బాధిత మహిళ నడుము కింది భాగంలో అమర్చారు వైద్యులు. ఈ పరికరంలో 2 ఎలక్ట్రోడ్‌లను అనుసంధానం చేసి వాటిని వైర్ల ద్వారా మెదడుకు సంకేతాలు తీసుకెళ్లే మెడ భాగంలో ఉన్న నరాల జంక్షన్‌తో అనుసంధానం చేశారు. దీంతో.. ఆ మహిళకు నొప్పి నుంచి ఉపశమనం కలిగింది.


సాధారణంగా ఈ న్యూరో స్టిమ్యులేటర్‌ చికిత్సను కేవలం దీర్ఘకాలిక వెన్నునొప్పులు, డయాబెటిక్‌ న్యూరోపతి వల్ల కలిగే నొప్పులు, ప్రమాదంలో కాళ్లు పడిపోయిన రోగులకు వినియోగిస్తుంటారు. ఇలా మైగ్రేన్‌ చికిత్స కోసం వినియోగించటం.. ఆసియాలోనే తొలిసారి అని డాక్టర్‌ సిద్ధార్థ్‌ చావలి వివరించారు. అయితే.. ఈ న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌ కోసం 11 నుంచి 12 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్తున్నారు. న్యూరో స్టిమ్యూలేటర్ ఇంప్లాంట్ ద్వారా చికిత్స సక్సెస్ అవటమనేది దీర్ఘకాలికంగా వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్తే అంటున్న ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌ ద్వారా బాధితులకు చక్కటి ఉపశమనం కలుగుతుందని వివరించారు. మైగ్రేన్ చికిత్స కోసం ఆసియాలోనే తొలిసారి విజయవంతంగా ఇలాంటి చికిత్స అందించడం ద్వారా ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, పరిష్కార మార్గాన్ని చూపడంలో తమ అంకిత భావం మరోసారి స్పష్టమైందని నాగేశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు.



Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM