byసూర్య | Sat, Apr 20, 2024, 03:21 PM
అమాయక గిరిజనుల నెత్తురు చిందిన ఇంద్రవెల్లి ఘటనకు నేటితో 43 ఏళ్లు పూర్తయ్యింది. 1981, ఏప్రిల్ 20న నాటి ప్రభుత్వం జరిపిన దమనకాండ ఆదివాసుల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయింది. నాడు సమైక్య పాలకుల నియంతృత్వం కారణంగా కనీసం నివాళులర్పించలేకపోయిన.. నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్తూపం వద్దకు గిరిజనం తరలివచ్చి నాటి చేదు ఘటనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తుంది.