byసూర్య | Sat, Apr 20, 2024, 02:43 PM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పోలోని వాగుపై సీటీ పాడు గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న వంతెన ఏడాదిగా పనులు కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. ఏడాది కింద పనులు మొదలుపెట్టి, ఇప్పటివరకు నత్తనడకన కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామస్తులు అయిజకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వంతెనను త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని శనివారం కోరారు.