byసూర్య | Sat, Apr 20, 2024, 01:32 PM
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో నీటి తొట్టెలో పడి బాలుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రంలోని బేల గ్రామానికి చెందిన బై గారి సాంబారి ఉపాధి నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల క్రితం మేడిపల్లి వచ్చి స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తుంది. గురువారం రాత్రి సమయంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి దగ్గర్లో ఉన్న నీటి తొట్టెలు పడి మృతి చెందాడు.