byసూర్య | Sat, Apr 20, 2024, 10:34 AM
ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రజ్వాన్సి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పొన్నాల శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని సూచించారు.