byసూర్య | Fri, Apr 19, 2024, 03:20 PM
మహబూబ్ నగర్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు నారాయణపేట మండలంలోని వివిధ గ్రామాల, పట్టణాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో మహబూబ్ నగర్ బయలుదేరి వెళ్లారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.