byసూర్య | Sun, Apr 14, 2024, 03:30 PM
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం కుర్ణి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం నుంచి కుర్ణి సంఘం నాయకులు బయలుదేరారు. ఆదివారం ఉదయం వివిధ గ్రామాల నుంచి అయిజ పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన అనంతరం వాహనాల్లో బయలుదేరారు.