byసూర్య | Wed, Apr 10, 2024, 12:58 PM
హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డడారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని బిజినేపల్లిలో చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి కర్నాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.