byసూర్య | Fri, Feb 23, 2024, 12:58 PM
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండి పడిందని అన్నారు. ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.