byసూర్య | Tue, Dec 05, 2023, 12:26 PM
కాంగ్రెస్, సీపీఐ పొందిక బాగా కలిసివచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సీపీఐతో పొత్తు కలిసి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని చెప్పారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేమి చేస్తారనే కేసీఆర్ను ఓడించారని విమర్శలు గుప్పించారు.
అయితే తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.