బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది: సుధీర్ రెడ్డి

byసూర్య | Sat, Dec 02, 2023, 11:19 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బ్రహ్మాండమైన ప్రచారాన్ని నిర్వహించారని, ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి తీరుతుందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుధీర్ రెడ్డి తన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తన విజయం కోసం ఎంతో కష్టపడ్డారని, వారం దరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో 49. 07 శాతం ఓట్లు పోలైనట్టు రిటర్నింగ్ అధికారి ఎస్. పంకజ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 573 పోలింగ్ బూత్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ పూర్తి చేశామన్నారు. ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM