హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం ,,,జి.కిషన్ రెడ్డి

byసూర్య | Tue, Nov 28, 2023, 10:06 PM

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎవడు హైదర్ అని అని ఆయన ప్రశ్నించారు. ఈ నగరానికి హైదర్ పేరు అవసరమా? అని అడిగారు. హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడని, ఎవడికి కావాలి హైదర్ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదర్ పేరు తీసేసి భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు. మద్రాస్ పేరును చెన్నైగా, బాంబేను ముంబైగా, కలకత్తాను కోల్ కతాగా, రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చినప్పుడు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుకోవడంలో తప్పేందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బానిస మనస్తత్వాలతో కూడిన ప్రతి ఒక్కదాని పేరును మారుస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. మేధావుల సలహాలను తీసుకుని మారుస్తామని తెలిపారు. ఆలోచనా విధానాల్లో కూడా మార్పును తీసుకొస్తామని అన్నారు. ముస్లింలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని... వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. 



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM