మున్ముందు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు.... రేవంత్ రెడ్డి

byసూర్య | Sat, Sep 23, 2023, 09:00 PM

మున్ముందు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మున్ముందు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఇతర పార్టీలకు చెందిన కొంతమంది ముఖ్య నాయకులు త్వరలో పార్టీలో చేరి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తారన్నారు. సోనియా గాంధీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు సభ కోసం మైదానం ఇవ్వకపోయినా, హోటళ్లు ఇవ్వకపోయినా విజయభేరి సభ భారీ విజయం సాధించిందన్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులలో 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారేనని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో ఉంటే ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకవచ్చునన్నారు. తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, గౌరవం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికి గౌరవంగా, స్వేచ్ఛగా బతకవచ్చునన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. అందుకే ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరమన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM