byసూర్య | Fri, Jun 09, 2023, 10:22 AM
అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దోమ ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నగా అటునుండి కలపలోడుతో వస్తున్న లారీని ఆపి డ్రైవర్ను అనుమతి పత్రాలు అడగగా ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకపోవడంతో లారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా కలపను తరలిస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని పోలీసులు తెలిపారు.