byసూర్య | Tue, Jun 06, 2023, 10:02 AM
తెలంగాణలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, యాదాద్రి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.