byసూర్య | Mon, May 29, 2023, 10:38 AM
గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. రైతు బీమా తరహాలో గీత కార్మికులకు కూడా జీవిత బీమా కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే గీత, కల్లు కార్మికుల వివరాలు సేకరించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ కింది అధికారులను ఆదేశించారు. మే 30 లోపు లబ్ధిదారులు, నామినీల వివరాలు పంపాలని సూచించారు. ఇక, గీతకార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తారు.