byసూర్య | Sat, Apr 01, 2023, 09:56 AM
యుద్ధ విద్యలో బాలికలు రాణించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు పురపలికలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జపాన్ కరాటే చోటో కాన్ మాస్టర్ శివకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బెల్టుల ప్రధాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. బాలికలు ఫోన్లు, టెలివిజన్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, కమిషనర్ వీరేందర్, వైస్ ఛైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్, తెలంగాణ స్కూల్ అండ్ స్పోర్ట్స్ కరాటే రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, భారాస నేతలు పెంటనోళ్ల యాదగిరి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.