byసూర్య | Sat, Mar 25, 2023, 11:23 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పే స్కెలు ప్రకటించింనందన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను సెర్ప్ ఉద్యోగులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని, ఉద్యోగులకు వేతనాలు పెంచి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ లో గత 20 సంవత్సరాలుగా సెర్ప్ ఉద్యోగులు మహిళ సంఘాల అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారని ఈరోజు ప్రభుత్వo వీరి సేవలు గుర్తించి పేస్కెలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మెప్మా ఉద్యోగులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులకు కూడా వర్తింప జేసేలా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సెర్ప్ సిబ్బంది ఎమ్మేల్యే ని పూల బొకే, శాలువాతో సన్మానించారు.