byసూర్య | Thu, Mar 23, 2023, 09:54 PM
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా, రేపటి నుంచి హాల్ టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. హాల్టికెట్పై హెడ్మాస్టర్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తామని, పరీక్షా కేంద్రాల చిరునామాను ముందుగానే సరిచూసుకోవాలని విద్యార్థులకు సూచించింది. హాల్ టిక్కెట్లను https://www.bse.telangana.gov.in సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.