byసూర్య | Mon, Mar 20, 2023, 11:29 AM
కామారెడ్డి పట్టణంలోని జన్మభూమి రోడ్డులో గత మూడు, నాలుగు రోజుల నుండి మురికి నీరు రోడ్డుపైకి రావడంతో ఉదయాన్నే స్కూల్ కి వెళ్లే, కళాశాల ఎగ్జామ్స్ వెళ్లే విద్యార్థులు మురికి నీళ్లల్లో నడవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత నాలుగు రోజులుగా మురికి నీరు రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో బీటపర్స్ , అర్చిడ్స్ స్కూల్, వశిష్ట డిగ్రీ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత జరుగుతున్న పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని కాలనీవాసులు కూడా ఆవేదన తెలుపుతున్నారు. వెంటనే అధికారులు మురికి కాల్వను క్లియర్ చేసి రోడ్డుపైకి మురికి నీరు రాకుండా చూడాలని అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు.