byసూర్య | Mon, Mar 20, 2023, 11:31 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మరోసారి హాజరయ్యారు. సోమవారం ఉదయం ఆమె ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇవాళ ఆమెను రామచంద్ర పిళ్లైతో కలిసి ఈడీ విచారించే అవకాశముంది. ఈ నెల 11న కవితను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇంటివద్దే తనను విచారించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24న ఆమె పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించనుంది.