స్విమ్మింగ్ పూల్ ను అందుబాటులోకి తేవాలి: ఎమ్మెల్యే

byసూర్య | Sat, Mar 18, 2023, 02:03 PM

ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి డివిజన్ సచివాలయ నగర్ కాలనీలోని స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నెలకొన్న లోపాలను యుద్ధ ప్రాతిపదికన సరిచేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన స్విమ్మింగ్ పూల్ ను ఆయన పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ లోని నీరు బయటకు వెళ్లేందుకు నూతనంగా పైప్ లైన్, మరో బోరును కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు కటిక అరవిందరెడ్డి, రాంబాబు, సుమంత్, గోపాల్ రెడ్డి , భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM