మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య

byసూర్య | Thu, Feb 02, 2023, 03:06 PM

నవాబ్ పేట్ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నవాబ్ పేట్ మండల ఎంపీపీ కాలే భవాని రవికాంత్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి కాలే జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సర్పంచ్ అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందడ నాగిరెడ్డి, చైర్మన్ రామ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM