రాలేనని కేసీఆర్ తో చెప్పా..నితీశ్ కుమార్

byసూర్య | Mon, Jan 30, 2023, 05:41 PM

తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాలేనని కేసీఆర్ తో చెప్పానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి17 (సీఎం కేసీఆర్ పుట్టినరోజు)న ఉదయం 11.30 గటంలకు కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి పలువురు జాతీయ నేతలతో పాటు ప్రముఖులు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ స్పెషల్ గెస్ట్‌గా హాజరు కానున్నారు.


అయితే.. బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలకు తాను హాజరు కావకపోవటంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వివరణ ఇచ్చారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ తనను ఆహ్వానించారని.. కాకపోతే.. తన బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. సమాధాన్‌యాత్రలో భాగంగా కైమూర్‌ జిల్లాలో పర్యటిస్తున్న నితీశ్‌ మీడియాతో మాట్లాడారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ నన్ను ఆహ్వానించారు. ఇక్కడ బిజీ షెడ్యూల్ కారణంగా రాలేనని చెప్పా. తమ పార్టీ తరఫున ఎవరినైనా పంపమని కేసీఆర్ కోరారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్‌కు చెప్పా. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కూడా ఓ మాట చెప్పాలని కేసీఆర్‌ అడిగారు. మీరు కూడా తేజిస్వితో స్వయంగా మాట్లాడండి అని కేసీఆర్‌కు సూచించా.' అని నితీశ్ కుమార్ వెల్లడించారు.


అయితే.. తాను బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరైనంత మాత్రాన.. కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన తర్వాత వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఖమ్మంలో ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు ఎందుకు వెళ్లలేదని అప్పట్లో మీడియా ప్రశ్నించగా.. తనకు పిలుపు రాలేదని, ఆహ్వానం అందినా వెళ్లేవాడిని కాదని నితీశ్‌ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభం అనంతరం సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ నేతలందరూ పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.



Latest News
 

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Fri, May 03, 2024, 12:02 PM
బిజేపీలో చేరిన మాజీ సర్పంచ్ Fri, May 03, 2024, 12:01 PM
రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM
హామీలు మరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి Fri, May 03, 2024, 10:42 AM