byసూర్య | Thu, Dec 08, 2022, 01:52 PM
కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని షరతు విధించింది. ఎఫ్ఆర్డీఓ హత్య, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్ర శాంతియుతంగా చేయాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే యాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే స్వేచ్చను, పోలీసులకు ఇచ్చింది. తన యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం పై మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు.