మీరు విచారణకు హాజరుకండి..నకిలీ సీబీఐ అధికారికి చెల్లింపులు చేసిన వారికి సీబీఐ నోటీసులు

byసూర్య | Thu, Dec 01, 2022, 10:35 PM

నకిలీ సీబీఐ అధికారికి ముడుపులు చెల్లించుకొన్న వ్యవహారంలో నులుగురు బడా పారిశ్రామిక వేతలకు నిజమైన సీబీఐ అధికార్లు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను సీబీఐ విచారణకు హాజరయ్యేలా చేసిన నకిలీ సీబీఐ అధికారి వ్యవహారం మరింత మంది తలకు చుట్టుకుంది. తానో సీనియర్ ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుని తిరుగుతున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి... తాను ప్రస్తుతం సీబీఐలో పని చేస్తున్నానని చెప్పుకుంటూ ఇటీవలే మంత్రి కమలాకర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇటీవలే కమలాకర్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు... ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు గురువారం కమలాకర్ సీబీఐ అధికారుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు.


ఓ వైపు గంగుల కమలాకర్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ వ్యవహారంలో మరో నలుగురు బడా వ్యాపారవేత్తలకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు వ్యాపారులను సీబీఐ ఆదేశించింది. తానో సీబీఐ అధికారిని అని శ్రీనివాసరావు చెప్పడంతోనే... భయపడిపోయిన హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలు ఆయనకు బారీ ఎత్తున డబ్బుతో పాటు బంగారాన్ని అందజేశారు. ఈ వ్యవహారం బయటపడటంతోనే సదరు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM