విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి
byసూర్య |
Tue, Oct 04, 2022, 03:34 PM
విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారం గ్రామానికి చెందిన చిన్నబోయిన యాదయ్య సోమవారం వ్యవసాయ బావి వద్ద మోటర్ కరెంట్ రిపేర్ చేసిన సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Latest News