byసూర్య | Mon, Oct 03, 2022, 03:14 PM
కరీంనగర్ లోని 11వ డివిజన్ గౌతమీ నగర్ కాలనీలో మానేరు డ్యామ్ కట్ట వద్ద నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ మెట్లు, రైలింగ్ ను ప్రారంభించిన బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య, టిఆర్ఎస్ నాయకులు చల్ల హరి శంకర్, ఎడ్ల అశోక్, కోల సంపత్, డివిజన్ వాసులు పాల్గొన్నారు.