వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
byసూర్య |
Fri, Sep 30, 2022, 04:53 PM
మహబూబ్ నగర్ పట్టణంలోని భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట తదితర లోతట్టు ప్రాంతాలలో శుక్రవారం మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, అధికార యత్రాంగం ఉన్నారు. మోకాలు లోతు నీళ్లలో దిగి లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిశీలించారు.
Latest News