byసూర్య | Sat, Sep 24, 2022, 07:32 PM
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మొత్తం 13 మందిపై చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కు.ని ఆపరేషన్లు చేసిన వైద్యుడిపై క్రిమినల్ కేసు పెట్టింది. ఆగస్టు 25న గంట సమయంలో 34 మందికి కు.ని ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ వికటించి 4గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.