byసూర్య | Sat, Aug 20, 2022, 10:31 AM
మంచిర్యాల పట్టణంలోని మజీదు వాడకు చెందిన ఒక యువతి అదృశ్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నారాయణ నాయక్ తెలిపారు.