byసూర్య | Mon, Aug 15, 2022, 03:46 PM
ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తార్నాక చౌరస్తా, తార్నాక లేబర్ అడ్డ, మాణికేశ్వరి నగర్, అడ్డగుట్ట, సీతాఫల్మండి, మెట్టుగూడ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మేయర్ బిజెపి రాష్ట్ర నాయకురాలు బండ కార్తిక రెడ్డి కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ రంగాల్లోని ప్రముఖులు పాల్గొన్నారు.