byసూర్య | Tue, Aug 09, 2022, 10:17 AM
కంటోన్మెంట్ లాల్ బజార్ చర్చిలో నిర్వహించిన ప్రార్థన సభలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్, తిరుమలగిరి సీఐ శ్రవణ్ కుమార్, ప్రవీణ్దవ్, రాజు సింగ్, సురేష్, సోమయ్య పాల్గొన్నారు.