డబ్బు అడిగాడని వ్య‌క్తిపై గొడ్డలితో దాడి

byసూర్య | Thu, Jul 07, 2022, 02:20 PM

వ్యక్తి పై గొడ్డలితో దాడి చేసిన ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద్‌ గ్రామంలో  చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాసరబాద్ గ్రామానికి చెందిన కొమర శెట్టి శ్రవణ్ అదే గ్రామానికి చెందిన బంటు శ్రీనుకు గతంలో డైరీ ఫామ్ నిర్వహిస్తుడగా కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఈ లావాదేవీల  పలుమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో బంటు శ్రీను  సోషల్ మీడియాలో గతంలో మాట్లాడిన ఆడియో పోస్ట్ చేశాడు. దీంతో కొమిరిశెట్టి శ్రవణ్ అతని దగ్గరకు వెళ్లి నాకు డబ్బులు ఇవ్వకపోగా సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నవ‌ని అడిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పదిమందిలో డబ్బులు అడుగుతావా అని కోపం పెంచుకున్న శ్రీను అతని ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని అతనిపై దాడి చేయగా తలకు రెండుచోట్ల గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM