భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు..వ్యాపారులకు రెడ్ కార్పెటా: రేవంత్ రెడ్డి

byసూర్య | Thu, Jun 23, 2022, 03:09 PM

భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు.. లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లు పరుస్తారా అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  విమర్శించారు. ‘బలవంతంగా భూమిని గుంజుకోవడం, బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం.. దీనిని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?’ అని మంత్రి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమ్జ్ భూనిర్వాసితులను  పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై లాఠీచార్జ్  చేయడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మంత్రి కేటీఆర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో  ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును ప్రారంభించారు. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో షేర్ చేసిన రేవంత్.. కేటీఆర్ పై  విమర్శలు గుప్పించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM