byసూర్య | Mon, May 23, 2022, 05:32 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్ కు ఆమోదం. సోమవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జేఎన్ టీయూ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్న వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, జోనల్ కమీషనర్ శంకరయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి pg కాలేజీలో ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం అవుతున్నాయని అందుకు సంబంధించిన ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మౌళిక వసతులు, సౌకర్యాల కల్పన కళాశాల భవనం నిర్మాణమయ్యే వరకు పీజీ కళాశాలలో తరగతుల నిర్వహణ, ఇంజనీరింగ్ కళాశాల పరిపాలనా భవనంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల 300 సీట్లతో ఇంజనీరింగ్, 60 సీట్లతో బీ ఫార్మసీ తరగతులు ఈ ఎమ్ సెట్ వెబ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులకు కనిపించనుందాన్నారు. వనపర్తి అప్షన్ ఇంజనీరింగ్ లో సీఎస్ఈ, సీఎస్ఈ (ఎఐ మరియు ఎంఎల్), ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ కోర్సులు ఉన్నాయి అన్నారు. ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్ కు ఆమోదం తెలిపింది అని వారన్నారు.