యాదాద్రి సన్నిధిలో మంత్రి సత్యవతి రాథోడ్
byసూర్య |
Sat, May 21, 2022, 12:47 PM
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికి. ఆశీర్వచనం అందించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కి మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. కలలో ఊహించని విధంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయాన్ని సీఎం కేసిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే గొప్ప సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు.
Latest News