byసూర్య | Mon, May 16, 2022, 12:19 PM
గతేడాదితో పోలిస్తే ఈసారి ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు లాభం జరిగింది. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మాత్రం తీవ్ర నష్టాన్ని చవి చూశారు.మూడు నెలల క్రితం కిలో రూ.100 ఉన్న ఉల్లి సడన్గా కిలో రూ. 20కి పడిపోయింది. ప్రస్తుతం దేశమంతటా ఇలాగే కొనసాగుతోంది. ఇతర రాష్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో భారీగా తగ్గింది. కర్నూలు మార్కెట్లో ప్రస్తుతం క్వింటా గరిష్ఠ ధర రూ.700కు చేరింది. నాసిరకం అయితే రూ.300 పలుకుతుంది. సగటు ధర రూ.500 మాత్రమే ఉంది. దీంతో భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఏపీలో ఉల్లి నిల్వకు అవకాశం లేకపోవడంతో ఎగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం గమనార్హం.