byసూర్య | Wed, Jan 19, 2022, 08:00 PM
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు . గంట వ్యవధిలో నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. దీనితో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్లోని మారేడిపల్లిలో ఓ మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారైంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే మరో దొంగ బషీరాబాద్ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు
మరో మహిళ నుంచి బంగారు గొలుసు తీసుకునే ప్రయత్నం విఫలమైంది. రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులు చోరీకి పాల్పడ్డారు. అలాగే జీడిమెట్లలో వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును అపహరించారు. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమా రాణి మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా కేకలు వేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో నాలుగు చైన్ స్నాచింగ్లతో