రైతులు అడ్డుకొంటారన్నా..పర్యటన రద్దు చేసుకొంది

byసూర్య | Tue, Jan 18, 2022, 02:30 PM

సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా మీ వరంగల్ పర్యటన రద్దైంది వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు దొరా? అని ప్రశ్నించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? అని ప్రశ్నించారు. 'పంట వానపాలు, రైతు కష్టం కన్నీటిపాలు, సాయం దొర మాటలకే చాలు' అని విమర్శించారు. పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? అని షర్మిల ప్రశ్నించారు. కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని వ్యాఖ్యానించారు.


Latest News
 

మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM