ఆ విద్యార్థులకు అలర్ట్.. !
byసూర్య |
Mon, Jan 17, 2022, 11:53 AM
కరోనా పరిస్థితుల కారణంగా డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు
https://www.braouonline.in/ లో చూడొచ్చని సూచించారు.
Latest News