byసూర్య | Mon, Jan 17, 2022, 11:36 AM
సీనియర్ సిటిజన్స్ కోసం అనేక రకాల పథకాలు ఉన్నాయి. వాటిలో తక్కువ రిస్క్ తో అధిక రాబడిని అందించే ఓ స్కీమ్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న అనేక రకాల పథకాల్లో పోస్టాఫీస్ అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) లో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ పథకం ద్వారా మంచి రాబడి అందుకోవచ్చు. ఇందులో చేరడానికి 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ఈ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు, కనీస మొత్తం రూ.1000 వరకు డిపాజిట్ చేసి ఆ మొత్తంపై వడ్డీ ప్రయోజనాలు అందుకోవచ్చు. ప్రస్తుతం ఎస్సీఎస్ఎస్ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఈ స్కీమ్ లో ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.