byసూర్య | Thu, Nov 18, 2021, 05:02 PM
నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోంది . కెసిఆర్ పతనం ఆరంభమైందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోంది. పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజ నేనే కొంటానని పోజులు కొట్టారు. ఇప్పుడేమైంది? తన కీర్తి కోసం తప్ప ప్రజల గురించీ ఎప్పుడు పట్టించుకోడు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియా తో మాట్లాడుతూ.... 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందని, వర్షాలకు తడిసి మొలక వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.