byసూర్య | Sun, Oct 24, 2021, 10:54 AM
హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ పై అవగాహన నడక నిర్వహించారు. 'స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్` లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల అవగాహన వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్, ఓయూ వీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.