నోముల భగత్‌ను గెలిపించాలి : ఆర్ కృష్ణయ్య

byసూర్య | Sat, Apr 10, 2021, 03:29 PM

 నాగార్జున సాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇవాళ హాలియాలో బీసీ, ఎంబీసీలకు చెందిన 40 సంఘాలు భగత్‌కు మద్దతుగా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై ప్రసంగించారు.నోముల నర్సింహయ్య చివరి శ్వాస వరకు ప్రజల కోసం తపించారు అని కృష్ణయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో నోముల వారసుడు భగత్‌కు టికెట్ ఇచ్చారు. భగత్‌ను గెలిపించాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఉందన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో బీసీలు మరోసారి చరిత్ర సృష్టించాలి. ప్రలోభాలకు గురికాకుండా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా బీసీలంతా భగత్‌కు ఓటేయ్యాలి అని విజ్ఞప్తి చేశారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. రైతులకు బాసటగా నిలుస్తూ.. వ్యవసాయాన్ని పండుగలా మార్చారు అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని కృష్ణయ్య పేర్కొన్నారు.


Latest News
 

చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM